భారీ మెజార్టీతో గెలుస్తా

14 Sep, 2014 00:34 IST|Sakshi
భారీ మెజార్టీతో గెలుస్తా

హత్నూర: టీఆర్‌ఎస్ కార్యకర్తల కృషి, నాయకుల పట్టుదలతో పనిచేశారని, అందువల్ల తాను భారీ మెజార్టీతో ఎంపీగా గెలుస్తానని టీఆర్‌ఎస్  ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం మండలంలోని దౌల్తాబాద్‌లో స్థానిక ఎమ్మెల్యే మదన్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ అభ్యర్థి సునీతారెడ్డి అధికారంలో ఉన్న పదిహేను సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో రోడ్లు కూడ ఆధ్వానంగా ఉన్నాయన్నారు. ఇక తెలంగాణ ద్రోహి జగ్గారెడ్డికి  ప్రజలే బుద్ధి చెప్పనున్నట్లు ఆయన తెలిపారు.విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు దేవేందర్‌రెడ్డి, మురళీధర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు