రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ సీఎం పీఏకి గాయాలు

17 Nov, 2014 08:41 IST|Sakshi

మహబూబ్నగర్ : తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ...పీఏ జాన్ వెస్లీ సోమవారం ఉదయం ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారును మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ వద్ద  ఓ లారీ ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. జాన్ వెస్లీకి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు.  కాగా ఆయన హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

మరిన్ని వార్తలు