గుండెపోటుతో నూతన ఉపసర్పంచ్‌ మృతి

26 Jan, 2019 17:45 IST|Sakshi

సాక్షి, వికారాబాద్‌ : వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలం రుక్మాపూర్‌ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. నూతనంగా ఉపసర్పంచ్‌గా ఎన్నికైన శ్రీశైలం గుండెపోటుతో మృతి చెందారు. ఉపసర్పంచ్‌గా శ్రీశైలం గెలుపొందిన ఆనందం నుంచి బయటకు రాకముందే ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ హఠాత్పరిణామంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. మాజీ మంత్రి మహేందర్‌ రెడ్డి శ్రీశైలం మృతి పట్ల ప్రగాఢసానుభూతి తెలిపారు. అతని కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీఇచ్చారు.

మరిన్ని వార్తలు