కరెంటు షాక్‌తో ఉపసర్పంచ్ మృతి

1 Dec, 2015 15:25 IST|Sakshi

జమ్మికుంట (కరీంనగర్ జిల్లా) : జమ్మికుంట మండలం శాయంపేట గ్రామ ఉపసర్పంచ్ గోపాల్ రావు(32) మంగళవారం కరెంటు షాక్‌తో మృతిచెందాడు. తన వ్యవసాయబావి వద్ద మోటారు ఆన్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గోపాల్ రావుకు భార్యా, ఇద్దరు పిల్లలున్నారు.

మరిన్ని వార్తలు