అంత్యక్రియల్లో పాల్గొన్న డిప్యూటీ స్పీకర్‌

7 Jun, 2018 10:48 IST|Sakshi
అంత్యక్రియల్లో పాల్గొన్న డిప్యూటీ స్పీకర్‌ 

దుబ్బాక: మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మేనమామ దుబ్బాక మండలం పోతారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ కొత్త గాలిరెడ్డి(71) మంగళవారం రాత్రి అనారోగ్యంతో మరణించాడు. బుధవారం ఉదయం జరిగిన గాలిరెడ్డి అంత్యక్రియల్లో డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి, రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, హౌజింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మడుపు భూంరెడ్డి పాల్గొన్నారు.

గాలిరెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని తలచారు. గాలిరెడ్డి గంభీర్‌పూర్‌ గ్రామ పంచాయతీకి 15 ఏళ్లుగా సర్పంచ్‌గా పని చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

మరిన్ని వార్తలు