ఎడారిగా గోదావరి

21 May, 2015 01:19 IST|Sakshi
ఎడారిగా గోదావరి

బాసర: ఆదిలాబాద్ జిల్లా బాసర వద్ద గోదావరి ఎడారిని తలపిస్తోంది. ప్రభుత్వం బోర్లు వేసిన ప్రాంతాల్లో మినహా మిగతా చోట నీటి చుక్క సైతం కనిపించడం లేదు. కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహిస్తామని రాష్ర్ట ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అక్కడి పరిస్థితి అందుకు ఏ మాత్రం అనుకూలంగా లేదు.

ఇప్పటికే బాసర అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు పడరాని పాట్లు పడుతుండగా, పుష్కరాల నాటికి సమృద్ధిగా వర్షాలు పడకుంటే.. .  పుష్కరస్నానాలకు మరిన్ని కష్టాలు తప్పవేమో మరి..

మరిన్ని వార్తలు