అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం

12 Nov, 2018 15:46 IST|Sakshi
హైదరాబాద్‌లో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న కిషన్‌రెడ్డి 

పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి

కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలతో ఆత్మీయ సమ్మేళనం

సాక్షి, ఆమనగల్లు: రాష్ట్రంలో మార్పు, అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని వంగా అనంతరెడ్డి గార్డెన్స్‌లో ఆదివారం నగరంలో ఉన్న కల్వకుర్తి నియోజక వర్గ ప్రజలతో బీజేపీ అభ్యర్థి ఆచారి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కిషన్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో ప్రధాని నరేంద్రమోదీ పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అనేక పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ కీలక శక్తిగా ఎదిగిందని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే బీజేపీని గెలిపించాలని కోరారు. గత ఎన్నికలలో కల్వకుర్తి నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్ధి ఆచారి స్వల్ప తేడాతో ఓడిపోయారని ఈ ఎన్నికలలో ఆచారి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

నగరంలో ఉంటున్న కల్వకుర్తి ఓటర్లు బీజేపీ అభ్యర్థి ఆచారికి అండగా ఉండాలని ఆయనకోరారు. కార్యక్రమంలో ఆచారి మాట్లాడుతూ కల్వకుర్తి నియోజక వర్గ ప్రజల అండదండలతోనే తాను ఈ స్థాయిలో ఉన్నానని అన్నారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలకు సేవకుడిగా పనిచేస్తానని అన్నారు. నియోజక వర్గంలో సాగునీరు, తాగునీరు అందించి నియోజక వర్గాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. సమావేశంలో ఆర్‌.కె.పురం కార్పొరేటర్‌ రాధా ధీరజ్‌రెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు మధుసూదన్‌రెడ్డి, స్వామిగౌడ్, కొలన్‌ శంకర్‌రెడ్డి, శ్రీనివాస్, మట్ట వెంకటేశ్, శ్రీనివాసులు, పత్యానాయక్, ఆమనగల్లు ఎంపీపీ లలితా వెంకటయ్య, జెడ్‌పీటీసీ సభ్యులు కండె హరిప్రసాద్, బీజేపీ నాయకులు సుండూరి శేఖర్, గోరెటి నర్సింహా, నారాయణ, బాలకృష్ణ, లక్ష్మణ్, మోహన్‌రెడ్డి, కోట్ల వెంకటేశ్, కాసుల వెంకటయ్య, దుర్గాప్రసాద్, రాఘవేందర్, పాండుప్రసాద్, నీలకంఠం పాండు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు