అభివృద్ధి పనులు ప్రారంభించిన విప్

24 Mar, 2016 13:35 IST|Sakshi

అదిలాబాద్ జిల్లా మందమర్రిలో ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు గురువారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రూ. 40 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణం, మురికి కాల్వల మరమ్మత్తుతో పాటు మరి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల అభివృద్ధే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు.

 

మరిన్ని వార్తలు