బాసరలో భక్తుడి హఠాన్మరణం

11 Jun, 2016 15:49 IST|Sakshi
బాసరలో భక్తుడి హఠాన్మరణం

బాసర: ఆదిలాబాద్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు గుండెపోటుతో మృతి చెందాడు. మహారాష్ట్రలోని నాందేడ్ పట్టణానికి చెందిన అవినాష్ (24) శనివారం ఉదయం అమ్మవారి దర్శనం చేసుకున్నాడు. తర్వాత గుట్టపై ఉన్న వ్యాసుడి గుహ చూసేందుకు వెళుతున్నపుడు గుండెపోటు రావడంతో  ఆకస్మాత్తుగా కింద పడిపోయాడు. గమనించిన స్థానికులు భక్తుడి మృతిచెందిన విషయాన్ని పోలీసులకు తెలిపారు. మృతదేహాన్ని ముధోల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి బంధువులకు సమాచారం అందించారు.

మరిన్ని వార్తలు