రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

29 Aug, 2016 14:19 IST|Sakshi
రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ
కరీంనగర్ : వేములవాడ రాజన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసం చివరి సోమవారం కావడంతో.. స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే రాజన్న దర్శనానికి భక్తులు బారులు తీరారు. సోమవారం ఉదయం భారీ వర్షం కురవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
 
మరోవైపు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జగిత్యాల, కరీంనగర్, వేములవాడ, రామగుండంలో సోమవారం ఉదయం కురిసిన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 
మరిన్ని వార్తలు