వేములవాడలో పోటెత్తిన భక్తులు

3 Nov, 2014 09:08 IST|Sakshi

వేములవాడ శ్రీరాజరాజేశ్వర ఆలయంలో కార్తీక మాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అందులోనూ రెండవ కార్తీక సోమవారం కావడంతో అమ్మ శ్రీరాజరాజేశ్వరి అనుగ్రహాన్ని పొందేందుకు భక్తజనం పోటెత్తింది. దర్శనం కోసం వచ్చిన భక్తులందరూ ప్రాత:కాలమే పుష్కరిణిలో పవిత్రస్నానాలు ఆచరించి ధర్మదర్శనం కోసం నిర్దేశించిన క్యూల్లో వేచివున్నారు.

అమ్మవారి దర్శనం కోసం భక్తులంతా శ్రీరాజరాజేశ్వరి నామాన్నిస్మరిస్తూ బారులు తీరారు. దాంతో అమ్మవారి దర్శనానికి ఐదు గంటల సమయం పడుతోంది.

మరిన్ని వార్తలు