జవాన్‌ స్వామి తండ్రి అదృశ్యం

3 Jul, 2019 16:15 IST|Sakshi

సాక్షి, కామారెడ్డి: తన తండ్రి సాయిరెడ్డి మూడు రోజులుగా కనపడటం లేదని, ఎవరో కిడ్నాప్‌ చేసుంటారని ఆర్మీ జవాన్‌ స్వామి అనుమానం వ్యక్తం చేశారు. తన భూమిని కబ్జా చేశారని ఇటీవల సోషల్‌ మీడియాలో స్వామి వీడియో పెట్టారు. ఈ నేపథ్యంలో  ఆయన తండ్రి అదృశ్యం కావడం అనుమానాలకు తావిస్తోంది. తన తండ్రి  కనపడటం లేదన్న సమాచారంతో స్వామి ఈ రోజు హుటాహుటిన తన సొంతూరు కామారెడ్డిలోని తాడ్వాయి మండలం చిట్యాల గ్రామానికి చేరుకున్నారు. తన తండ్రి అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు మీడియాకువెల్లడించారు. ఈ పరిస్థితుల్లో తన కుటుంబాన్ని కాపాడుకోవాలో లేక దేశ రక్షణ కోసం సరిహద్దులో ఉండాలో తోచడం లేదని జవాన్‌ స్వామి ఆందోళన చెందుతున్నారు.   

మరిన్ని వార్తలు