సాక్షి, రాజేంద్రనగర్: దిశ తండ్రి శుక్రవారం రాజేంద్రనగర్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీనియర్ అసిస్టెంట్గా విధుల్లో చేరారు. తన జాయినింగ్ రిపోర్టును ప్రిన్సిపాల్ అంజయ్యకు అందజేశారు. ఆయన ఇంతకుముందు మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్లోని రాణి ఇంద్రాదేవి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహించే వారు. ఆయన బదిలీ కోసం ప్రభుత్వానికి అర్జీ పెట్టుకోగా ప్రభుత్వం రాజేంద్రనగర్ జూనియర్ కళాశాలకు బదిలీ చేసింది.