సాక్షి, హైదరాబాద్ : తమ కుమారుడికి మెరుగైన వైద్యం అందించాలని చెంగిచర్ల ఆయిల్ ట్యాంకర్ పేలుడు ఘటనలో గాయపడిన వెంకట్నాయక్ తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ ఘటనలో గాయపడిన వెంకట్ నాయక్ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. 80 శాతం కాలిన గాయాలతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇతను చెన్నయ్లో ఎంటెక్ పూర్తి చేసి ప్రస్తుతం టీఎస్ ఆర్టీసీలో కాంట్రాక్ట్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు.