దోస్త్‌–2020  సేవలు నిలుపుదల 

2 Jul, 2020 03:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల ప్రక్రియ నిలిచిపోయింది. కరోనా తీవ్రం కావడంతో యంత్రాంగం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి దోస్త్‌ కన్వీనర్‌ ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 1 నుంచి 14వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ, 6 నుంచి 15వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు, 22న సీట్‌ అలాట్‌మెంట్‌ నిర్వహించాలి. కానీ కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఈ ప్రక్రియను వాయిదా వేసినట్లు దోస్త్‌ కన్వీనర్‌ లింబాద్రి తెలిపారు. తదుపరి తేదీలను త్వరలో ప్రకటించనున్నట్లు బుధవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు