కంటతడి పెట్టిన స్పీకర్‌ పోచారం 

8 Jun, 2020 04:55 IST|Sakshi

‘డబుల్‌’ ఇళ్ల నిర్మాణంలో విమర్శలపై ఆవేదన  

వర్ని: డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభం సందర్భంగా అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. ఆదివారం ఆయన నిజామాబాద్‌ జిల్లా కోటగిరి మండలం హంగర్గా గ్రామంలో 30 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, నష్టం వస్తుందన్న కారణంతో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావ డం లేదన్నారు. ఈ దశలో తన తనయుడితోపాటు మం డల ప్రజాప్రతినిధులను బ్రతిమా లి ఇళ్ల నిర్మాణం ముందుకు సాగేలా చూస్తున్నామన్నారు. వేరే నియో జకవర్గాల్లో తొలి విడత ఇళ్ల నిర్మా ణం కూడా పూర్తి కాలేదని, ఇక్కడ ఇంత మంచి కార్యక్రమం చేస్తుంటే కొందరు అర్థం చేసుకోకుండా విమర్శలు చేస్తుండడం బాధ కలిగిస్తోందంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే వెంటనే సర్దుకున్నారు.

మరిన్ని వార్తలు