చార్జింగ్‌ లేదని దించేశారు..

2 Mar, 2018 07:20 IST|Sakshi
బస్సు నిలిపివేయడంతో ఎండలో వేచి ఉన్న ప్రయాణికులు,చార్జింగ్‌ అయిపోయిన టికెట్ల జారీ యంత్రం

సూరారం:  ఎక్కడైనా బస్సు మొరాయిస్తే ప్రయాణికులను మరో బస్సులో ఎక్కించి పంపిస్తారు. కానీ టికెట్లు జారీ చేసే (ఈ–పోస్‌) మెషిన్‌ చార్జింగ్‌ అయిపోయిందనే సాకుతో కుత్బుల్లాపూర్‌ పరిధిలోని హెచ్‌ఎంటీ రోడ్డులో ప్రయాణికులను బస్సులోంచి దించేశారు. గురువారం ఉదయం 11 గంటల సమయంలో అటువైపు బస్సులు రాకపోవడంతో చాలాసేపు ఎదురుచూసి ఇతర బస్సుల్లో ప్రయాణించారు. కండాక్టర్‌ ముందుగానే మెషిన్‌ను చెక్‌ చేసుకొని ఉండాల్సిందిగా ప్రయాణికులు పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు