మే 14న తెలంగాణలో ఎంసెట్ పరీక్ష.. 24న ఫలితాలు

3 May, 2015 19:28 IST|Sakshi
మే 14న తెలంగాణలో ఎంసెట్ పరీక్ష.. 24న ఫలితాలు

హైదరాబాద్: తెలంగాణలో మే 14న ఎంసెట్ పరీక్షను నిర్వహించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ రమణారావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 18న ఎంసెట్ కీ, 24న ఎంసెట్ ఫలితాలు విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు. అయితే ఎంసెట్ పరీక్షల నిర్వహణలో భాగంగా ఇంజినీరింగ్ పరీక్షకు 251 సెంటర్లు, మెడికల్ అండ్ అగ్రికల్చరల్ 172 సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. హైదరాబాద్ను 8 జోన్లుగా విభజించి విద్యార్థులను సమీప ప్రాంతంలోనే ఎంసెట్ పరీక్ష సెంటర్లు ఏర్పాట్లు చేస్తున్నామని రమణారావు తెలిపారు.
 

మరిన్ని వార్తలు