పాల్వంచలో కంపించిన భూమి!

5 Apr, 2020 13:29 IST|Sakshi

భద్రాద్రి కొత్తగూడెం: కరోనా భయాలతో వణికిపోతున్న పాల్వంచ జనాన్ని భూమాతా భయపెట్టింది. ఆదివారం మధ్యాహ్నం అక్కడ భూమి రెండు సెకన్లపాటు కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అసలే దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో జనమంతా ఇళ్లల్లోనే గడుపుతున్న సమయంలో ఈ పరిణామం ఒకింత కలవరపెట్టిందని స్థానికులు అంటున్నారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 272 కేసులు నమోదు కాగా.. 11 మంది మరణించారు. ఇక జిల్లాలో నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.
(చదవండి: కరోనా కల్లోలం)

మరిన్ని వార్తలు