జగన్ సీఎం కావాలి

21 Mar, 2014 04:18 IST|Sakshi
సైలాన్‌బాబా దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించిన షేక్ ఎజాజ్ రజాక్

వినాయక్‌నగర్, న్యూస్‌లైన్:వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి కావాలంటూ మహారాష్ట్రలోని జాల్నా నగరం సమీపంలో గల సైలాన్ బాబా దర్గాలో గురువారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నిజామాబాద్ నగరానికి చెందిన వైఎస్ అభిమాని షేక్ ఎజాజ్ రజాక్ గులాఫ్-ఎ-ముబారక్ ఆధ్వర్యంలో ఈ ప్రార్థనలు జరిగాయి.

బాబా సందల్ వేడుకల సందర్భంగా చాదర్ కూడా సమర్పించారు (గులాబీ పూల మాల) ఈ సం దర్భంగా రజాక్ మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాలు పేదవారికి  పూర్తిగా అందలాంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి కావాలని ఆయన అభిప్రాయపడ్డారు.

తె లంగాణ రాష్ట్రంలో కూడా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని, పేదల లబ్ధి కోసం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాలు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో అమ లవుతాయని ఆశభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో అమరులు అయినవారి ఆత్మలు శాంతించాలని దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు ఆయన తెలిపారు.  

మరిన్ని వార్తలు