అన్నను చంపిన తమ్ముడు

19 Jul, 2015 10:07 IST|Sakshi

మహబూబ్ నగర్ (బిజినేపల్లి) : కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా బిజేనేపల్లి మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని శయనిపల్లి గ్రామంలో ఆంజనేయలు అనే వ్యక్తి.. అతని తమ్ముడు మార్కేండయపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఆంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాగా దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

>
మరిన్ని వార్తలు