ప్రాణం తీసిన పింఛన్‌! 

30 Mar, 2018 09:05 IST|Sakshi
ఎరుకల బక్కవ్వ

పెన్షన్‌ కోసం ఎండలో నిరీక్షణ 

ఇంటికి వెళ్లగానే అస్వస్థతతో మృత్యువాత 

రామారెడ్డి(ఎల్లారెడ్డి) : పింఛన్‌ డబ్బుల కోసం ఉదయం నుంచి ఎండలో నిరీక్షించిన ఓ వృద్ధురాలు మృతి చెందింది. మండలంలోని రెడ్డిపేట గ్రామంలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఎరుకల బక్కవ్వ (75) వృద్ధాప్య పింఛన్‌ కోసం గురువారం ఉదయం గ్రామంలోని పోస్టాఫీస్‌కు వెళ్లింది. ఉదయం నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు మండుటెండలో పింఛన్‌ కోసం పడిగాపులు కాసింది. దీంతో మధ్యాహ్నం వేళ ఇంటికి వెళ్లిన ఆమె తీవ్ర అస్వస్థతకు గురై కన్నుమూసింది. పింఛన్‌ పంపిణీదారుడు చంద్రమౌళి నిర్లక్ష్యం కారణంగానే బక్కవ్వ మృతి చెందిందని గ్రామస్తులు ఆరోపించారు. గతంలోనూ పింఛన్‌ పంపిణీలో తీవ్ర నిర్లక్ష్యం చేశాడని, అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  

మరిన్ని వార్తలు