ప్రచారానికి పనుల దెబ్బ

21 Nov, 2018 09:57 IST|Sakshi

గ్రామాల్లో ఓ వైపు వ్యవసాయం, మరోవైపు ప్రచారం

ప్రజలు ఉండే సమయాల్లోనే వెళ్తున్న ప్రజాప్రతినిధులు

జన సమీకరణ చేయలేక తలలు పట్టుకుంటున్న ద్వితీయ శ్రేణి నాయకులు

సాక్షి, భూపాలపల్లి: అసలే పనుల కాలం.. పత్తి ఏరే దశ.. వరి కోసే దశ.. మిరప పిందెలు పడే   క్రమంలో నిత్యం పల్లెలు బిజీబిజీగా ఉంటున్నాయి. ఈ తరుణంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన గ్రామాల్లో ఒక్క పురుగు కనపడడం లేదు. నేతల ప్రచారానికి వ్యవసాయ పనుల దెబ్బ తాకుతోంది. గత రెండు వారాల నుంచి నేతలు విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇదే సమయంలో జిల్లాలో వరి కోతలు, పత్తి తీయడం, మిరపలో కలుపులు తీయడం వంటి  పనుల్లో వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు నిమగ్నమై ఉంటున్నారు. మధ్యాహ్నం పూట గ్రా మాల్లో  నిశబ్ధ వాతావరణం కనిపిస్తోంది. నేతలు తమ ప్రచారాన్ని ఉదయం పది గంటలకు ముందు, సాయంత్రం నాలుగు గంటల తర్వాత కొనసాగించే పరిస్థితి కనిపిస్తోంది. 

ఇటు ప్రచారం.. అటు వ్యవసాయం..
ప్రస్తుతం జిల్లాలో ఓ వైపు ప్రచారం మరోవైపు వ్యవసాయ అన్న వాతావరణం కనపడుతోంది. రెండూ ఓకేసారి కావడంతో  నవంబర్, డిసెంబర్‌ నెలల్లో జిల్లాలోని ప్రజలకు వరి పంట చేతికి వస్తుంది.  జిల్లాలోని 20 మండలాల్లో జోరుగా కోతలు నడుస్తున్నాయి. మరోవైపు పత్తి తీసేందుకు గ్రామాల్లోని వ్యవసాయదారులు, కూలీలు చేలకు వెళ్తున్నారు.  

నాయకులు, కార్యకర్తల పాట్లు ..
ప్రస్తుతం గ్రామాల్లోని నాయకులు, కార్యకర్తలు జన సమీకరణ కోసం తీవ్రంగా పాట్లు పడుతున్నారు. కొంతమంది నాయకులు వ్యవసాయ భూముల్లో పనులు చేసుకుంటున్న రైతులు, కూలీలను చెలుకలకు వద్దకు వెళ్లి ప్రసన్నం చేసుకుంటున్నారు.  జర మాకు ఓటేయండి.. మీకు అండగా ఉంటామని బతి మిలా డుకుం టున్నారు. కొంతమంది వ్యవసాయ పనుల్లో చేదోడు వాదోడుగా కొద్దిసేపు పనులు చేస్తూ మరీ మెప్పి ంచడం విశేషం. ఇక కొంతమంది ప్రజాప్రతినిధులు తెల్లవారకముందే ఓటరును ప్రసన్నం చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. జిల్లాలో గ్రామీణ జనాభే అధికం. ప్రధాన వృత్తి వ్యవసాయం.  తమ నాయకుడు వచ్చి ప్రచారం చేసే సమయంలో ప్రజలు పలుచగా ఉంటే మొదటికే మోసం వస్తుందని ద్వితీయ శ్రేణి నాయకులు వాపోతున్నారు.

జనాలు తక్కువ కాకుండా ఇతర ప్రాం తాల నుంచి జనాల్ని తీసుకురావడమో, తమ గ్రామాల్లోని వారే ఏదో విధంగా ఉండే ప్రయత్నాలు చేస్తున్నారు. నేతలు ప్రచారానికి వచ్చే రోజు ఎలాగైనా ప్రజలు ఉండే విధంగా చూసుకుంటున్నారు. గ్రామాల్లో కూలీలు లేకపోతే వ్యవసాయ పనులు కష్టం కాబట్టి ముఖ్యంగా వీరు పనులకు వెళ్లకుంటే దాదాపుగా గ్రామాల్లోని ప్రజలందరూ పనులకు వెళ్లరని భావిస్తున్నారు. దీంతో ఈ రోజు తమ గ్రామంలో ప్రచారం ఉందంటే గ్రామాల్లోని నాయకులు ప్రజలు ఉండే ట్లు ప్రణాళికలు వేసుకుంటున్నారు. ముందురోజు కూలీలకు కూలీ డబ్బులు ఇవ్వడంతో పాటు భోజనం, తాగే వారికి మందును కూడా సరఫరా చేస్తున్నారు. మరోవైపు అత్యవసమైతే కూలీలు రాకున్నా ఇంటిల్లిపాది వ్యవసాయ పనులకు వెళ్తున్నారు. 

మరిన్ని వార్తలు