ఎన్నికల సిత్రాలు

6 Dec, 2018 16:18 IST|Sakshi

సతీశ్‌ను గెలిపించు స్వామి

హుస్నాబాద్‌: టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వొడితెల సతీష్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని  బుధవారం స్థానిక సిద్ధేశ్వర ఆలయంలో మహిళలు జలాభిషేకం నిర్వహించారు. 
స్థానిక ఎల్లమ్మ దేవాలయం నుంచి నీళ్ల బిందెలతో మహిళలు ర్యాలీగా వెళ్లారు. 

గుర్తుంచుకోవాలని..

కల్హేర్‌(నారాయణఖేడ్‌): కల్హేర్‌ మండల కేంద్రంలో టీఆర్‌ఎస్‌ నేతలు వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చిన్న కారు బొమ్మను తీసుకొచ్చి తిప్పుతూ ఓటర్లకు గుర్తుపై అవగాహన కల్పించారు. కారు గుర్తుకు ఓటేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి భూపాల్‌రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 

ప్రచారానికి కాదు.. బడికి

న్యాల్‌కల్‌(జహీరాబాద్‌): న్యాల్‌కల్‌లో టీఆర్‌ఎస్‌ టోపీతో అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్తున్న ఓ బుడ్డోడు 

మరిన్ని వార్తలు