శ్రీధర్‌బాబు ఇంట్లో  తనిఖీ

23 Nov, 2018 01:20 IST|Sakshi

నగదు నిల్వలున్నట్లు ఫిర్యాదు

లభించలేదన్న ఎన్నికల అధికారులు 

మంథని: మాజీ మంత్రి, మంథని అసెంబ్లీ కాంగ్రెస్‌ అభ్యర్థి డి. శ్రీధర్‌బాబు ఇంట్లో గురువారం ఎన్నికల అధికారుల బృందం తనిఖీలు నిర్వహించింది. మంథని పట్టణంలోని శ్రీధర్‌బాబు ఇంట్లో నగదు నిల్వలు ఉన్నట్లు ఫిర్యాదు రావడంతో పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఎంసీసీ ఎన్నికల అధికారులు సుమారు గంట పాటు తనిఖీలు నిర్వహించారు.

అయితే ఎలాంటి నగదు దొరకలేదని బృందం ఇన్‌చార్జి జయరాజ్‌ తెలిపారు. వీడియో కవరేజీలో తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని జయరాజ్‌ వివరించారు.  

మరిన్ని వార్తలు