'ఎక్కడివారు.. అక్కడే పనిచేయాలి'

2 May, 2015 17:57 IST|Sakshi
'ఎక్కడివారు.. అక్కడే పనిచేయాలి'

హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగుల పంపిణీ మార్గదర్శకాల రూపకల్పన కమిటీ, ఉద్యోగుల పంపిణీ కమిటీల చైర్మన్ కమల్‌నాథన్ను శనివారం కలిశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల విభజనను వెంటనే పూర్తి చేయాలని టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు దేవిప్రసాద్ డిమాండ్ చేశారు.

ఏ రాష్ట్ర ఉద్యోగులు ఆ రాష్ట్రంలోనే పనిచేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. తప్పుడు స్థానికత ధ్రువీకరణ పత్రాలు సమర్పించిన ఉద్యోగులపై తగిన చర్యలు తీసుకోవాలని దేవిప్రసాద్ తెలిపారు.

మరిన్ని వార్తలు