దీపారాధనతో ముగిసిన ఉర్సు

30 Mar, 2014 01:10 IST|Sakshi

 అర్వపల్లి, న్యూస్‌లైన్ అర్వపల్లిలోని హజ్రత్ ఖాజా నసీరుద్దీన్ బాబా దర్గా ఉర్సు ఉత్సవాలు శనివారం ముగిశాయి. శనివారం దర్గాలో దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉత్సవాలకు హాజరైన భక్తులు కూడా దీపాలు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన డబుల్ పార్టీ నిర్వహించిన ఖావాలి ఆకట్టుకుంది.

 

అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తుంగతుర్తి సీఐ కె. పార్ధసారథి, అర్వపల్లి ఎస్‌ఐ కె.కొండల్‌రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే అర్వపల్లి పీహెచ్‌సీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్గా చైర్మన్ సాయిని ఉమ్మయ్య, ముజావరి నసీరుద్దీన్, సభ్యులు మల్లేష్, హబీబ్, శ్రీను, జహంగీర్, సత్తయ్య, ఖాజాపాష, గోరేబాయి, మున్నా, రవూఫ్, అఖీల్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు