ముగిసిన మండలి  ఎన్నికల ప్రచారం 

21 Mar, 2019 03:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గాలకు ఈ నెల 22న (రేపు) ఎన్నికలు జరగనున్నాయి. మండలి ఎన్నికల ప్రచార పర్వం బుధవారంతో ముగిసింది. మెదక్‌–నిజామాబాద్‌–ఆదిలాబాద్‌–కరీంనగర్‌ పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాలతోపాటు వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. మెదక్‌–నిజామాబాద్‌–ఆదిలాబాద్‌–కరీంనగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 17 మంది, మెదక్‌–నిజామాబాద్‌–ఆదిలాబాద్‌–కరీంనగర్‌ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఏడుగురు, వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి తొమ్మిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 

మరిన్ని వార్తలు