అందరూ సంతోషంగా ఉండాలని ప్రార్థించా!

24 May, 2015 19:22 IST|Sakshi

తెలంగాణ అటవీ శాఖ మంత్రి జోగు రామన్న
తిరుమల: ప్రజలందరూ సంతోషంగా ఉండాలని వేంకటేశ్వరస్వామిని ప్రార్థించానని తెలంగాణ అటవీ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. ఆదివారం ఉదయం తిరుమలలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. దర్శనానంతరం మంత్రి ఆలయం ఎదుట మీడియాతో మాట్లాడారు.

కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతియేటా తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీ అని, ఇందులో భాగంగానే కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో కలసి వచ్చి స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నామని తెలిపారు.

మరిన్ని వార్తలు