మాజీ ఎమ్మెల్యే ఓదెలుకు మాతృవియోగం

8 Apr, 2019 14:51 IST|Sakshi
పరామర్శిస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే బాల్క సుమన్‌

మందమర్రిరూరల్‌: చెన్నూర్‌ మాజీ ఎమ్మెల్యే  నల్లాల ఓదెలు తల్లి  నల్లాల పోశమ్మ (74) కొంత కా లంగా అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారు జా మున మృతి చెందింది.  పోశమ్మ భౌతికకాయం మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి మందమర్రిలో ని రెండవ జోన్‌లోని ఇంటికి తీసుకువచ్చారు. సా యంత్రం స్థానికంగా అత్యక్రియలు నిర్వహిం చారు. రాష్త్ర సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్, చెన్నూర్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్, బెల్లంపల్లి మా జీ ఎమ్మెల్యే  గుండా మల్లేష్, గ్రంధాల య చైర్మన్‌ రేణికుంట్ల ప్రవీణ్‌కుమార్, వ్యవసాయ మార్కెట్‌ కమిటి చైర్మన్‌ ప్రబాకర్‌రావ్, టీబీజీకేఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెంగర్ల మల్లయ్య , ప్రదాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి,  ఏఐటీయూసీ  ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతా రామ య్య, ఎంపీపీ బొలిశెట్టి కనుకయ్య, సర్పం చ్‌ల ఫోరం మండల అద్యక్షుడు ఒడ్నాల కొమురయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి కలవేణ శంకర్‌ భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళి అర్పించారు.    

మరిన్ని వార్తలు