గులాబీ గూటికి రాథోడ్ రమేష్..?

19 Mar, 2016 02:57 IST|Sakshi
గులాబీ గూటికి రాథోడ్ రమేష్..?

  గులాబీ గూటికి     రాథోడ్ రమేష్..?

 సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ టీఆర్‌ఎస్ పార్టీలోకి చేరనున్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావును కలిసినట్లు సమాచారం. ఈ ఘటన జిల్లా రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. టీడీపీ రాష్ట్ర స్థాయిలో కీలక నేతగా రాథోడ్‌కే పేరుంది.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితునిగా ఉండే ఈయన టీఆర్‌ఎస్ తీర్థ పుచ్చుకుంటున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. ఈ విషయమై రాథోడ్ రమేష్‌ను సంప్రదించగా.. తాను పార్టీ మారే విషయమై వచ్చిన వదంతులను కొట్టిపారేశారు. టీడీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. కొందరూ నాయకులు పార్టీని వీడినంత మాత్రన నష్టం ఏమీ లేదని.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు.

మరిన్ని వార్తలు