ఒకే ర్యాంకు-ఒకే పింఛన్ కోరుతూ రిలే దీక్షలు

1 Sep, 2015 15:58 IST|Sakshi

ఇందిరాపార్కు (హైదరాబాద్) : ఒకే ర్యాంకు-ఒకే పింఛన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ సైనికులు రిలే నిరాహార దీక్షలకు దిగారు. నగరంలోని ఇందిరాపార్కులో పలువురు మాజీ సైనికులు మంగళవారం దీక్షలకు దిగారు. ఈ కార్యక్రమంలో త్రివిధ దళాల మాజీ సైనిక అధికారి విద్యాసాగర్ పాల్గొన్నారు. తమ డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలని ఆయన కోరారు.

మరిన్ని వార్తలు