గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు

28 Jan, 2016 13:38 IST|Sakshi
గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు
సుల్తానాబాద్: గుడుంబా తయారీ కేంద్రాలపై పోలీసులు ఎక్సైజ్ అధికారులతో కలిసి దాడులు నిర్వహించారు. కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం గారెపల్లిలో గురువారం తెల్లవారుజాము నుంచి దాడులు నిర్వహించిన పోలీసులు ఎనిమిది మంది గుడుంబా తయారీ దారుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో పోలీసులు 400 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేయడంతో పాటు రూ. 28 వేలు విలువ చేసే గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు.
 
మరిన్ని వార్తలు