వైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాపుల యజమానులకు హెచ్చరిక

7 Oct, 2019 18:05 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌: దసరా పండగ సందర్భంగా వైన్‌ షాపుల యజమానులకు ఎక్సైజ్‌ శాఖ సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చింది. మద్యం ఎమ్మార్పీకి మించి అమ్మితే రూ.2 లక్షల జరిమానా విధించడంతోపాటు వారం రోజులు షాపు లైసెన్స్‌ సస్పెండ్‌ చేస్తామని తెలంగాణ వైన్‌ షాపుల యజమానులను ఎక్సైజ్‌ శాఖ హెచ్చరించింది. శుక్ర,శనివారాలలో హైదరాబాద్‌, నల్గొండ, వనపర్తి, నిజామాబాద్‌ జిల్లాల్లోని 8 వైన్‌ షాపుల్లో ఎమ్మార్పీకి మించి మద్యం అమ్మినట్టుగా స్పెషల్‌ టీమ్‌లు గుర్తించాయని పేర్కొంది. దసరా పండగ రద్దీని సొమ్ము చేసుకునేందుకు ఏ వైన్‌ షాపు యాజమాని ప్రయత్నించినా చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేషన్లకు అదనంగా స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీంలు నాలుగు, ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీంలు పది, డిస్ట్రిక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీంలు 34 ఏర్పాటు చేసినట్లు తెలిపింది.  ఎమ్మార్పీకి మించి ఎక్కువ ధరలకు మద్యం విక్రయిస్తే సంబంధిత ఫోన్‌ నెంబర్లకు ఫిర్యాదు చేయవచ్చు.

ఫిర్యాదు చేయాల్సిన ఫోన్​ నంబర్లు                                                                
స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూం 040–-24733056
హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 040-–24746884
రంగారెడ్డి 040–24600450
ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 08732–220229
నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 08762–237551
మెదక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 08455–-271232
నల్గొండ  08682–224271
మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 08542–242488
వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 08702–577412
కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 08782–262330
ఖమ్మం 08742–224342

మరిన్ని వార్తలు