గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు

5 Aug, 2015 18:57 IST|Sakshi

కోటపల్లి: ఆదిలాబాద్ జిల్లా కోటపల్లి మండలం అన్నారం గ్రామంలోని నాటు సారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్, సాధారణ పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 200 లీటర్ల సారాను స్వాధీనం చేసుకోవడంతోపాటు, సారా తయారీ కోసం సిద్ధంగా ఉంచిన 4వేల లీటర్ల పానకాన్ని ధ్వంసం చేశారు. నలుగురిపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
 

మరిన్ని వార్తలు