‘ఫేస్‌బుక్’ పెళ్లి

7 May, 2015 04:23 IST|Sakshi
‘ఫేస్‌బుక్’ పెళ్లి

ములుగు అబ్బాయి..ముంబై అమ్మాయి
ఒక్కటైన జంట

 
ములుగు : ఫేస్‌బుక్ పరిచయం ప్రేమగా మారింది. ఇరువురి పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలెక్కింది. ములుగు పట్టణానికి చెందిన ఇనుముల రామస్వామి, సుగుణ దంపతుల కుమారుడు కిరణ్‌కు 2013లో ఫేస్‌బుక్ ద్వారా ముంబైకి చెందిన సరస్వతితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది.

దీంతో వారు ఇరువురి పెద్దలను ఒప్పించారు. ఈ మేరకు ములుగులోని చర్చిలో కిరణ్, సరస్వతి బుధవారం పెళ్లి చేసుకున్నారు. వివాహ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ వ్యవ స్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ, జెడ్పీ ఫ్లోర్‌లీడర్ సకినాల శోభన్ తదితరులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

>
మరిన్ని వార్తలు