కలెక్టర్ చొరవతో అనాథాశ్రమానికి...

5 May, 2015 16:49 IST|Sakshi
కలెక్టర్ చొరవతో అనాథాశ్రమానికి...

సుల్తానాబాద్ (కరీంనగర్ జిల్లా): మతిస్థితిమితం కోల్పోయి రోడ్డుపై తిరుగుతున్న ఒక మహిళ..  కలెక్టర్ చొరవతో అనాథాశ్రమానికి చేరింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలో మంగళవారం జరిగింది. సుల్తానాబాద్ పోలీస్‌స్టేషన్ సమీపంలో మతి స్థిమితం కోల్పోయిన అనాథ మహిళ ఒకరు తిరుగుతున్నారు. అటుగా వెళ్తున్న జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ కుమారీ ఈ విషయాన్ని గమనించి రెవెన్యూ, పోలీసు అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు స్పందించిన రెవెన్యూ, పోలీసు అధికారులు ఆ మహిళను కరీంనగర్‌లోని అనాథ శరణాలయానికి తరలించారు.

మరిన్ని వార్తలు