స్వ‌స్థ‌లానికి పంపించండి: కుటుంబం ఆవేద‌న‌

10 Apr, 2020 21:11 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌: క‌రోనా వైర‌స్‌ను క‌ట్ట‌డి చేసేందుకు ప్ర‌భుత్వం విధించిన లాక్‌డౌన్ ఎంద‌రో సామాన్యుల‌ను ఇబ్బందికి గురి చేస్తోంది. ఎక్క‌డి వాళ్ల‌క్క‌డే అంటూ ఒక్కసారిగా ఆదేశాలివ్వ‌డంతో చాలామంది త‌మ స్వ‌స్థ‌లాల ద‌గ్గ‌ర కాకుండా ఇత‌ర ప్ర‌దేశాల్లో ఇరుక్కుపోయారు. కామారెడ్డి ప్రాంతానికి చెందిన ఓ మ‌హిళ ప‌దిహేను రోజుల క్రితం నిజామాబాద్ ప్ర‌భుత్వ జ‌న‌ర‌ల్ ఆసుప‌త్రిలో డెలివ‌రీ అయ్యింది. అయితే స్వ‌స్థ‌లానికి వెళ్లేందుకు బ‌స్సులు లేక‌పోవ‌డంతో న‌గ‌రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలోని చెట్టు కింద ఆ మ‌హిళ కుటుంబం ఆశ్ర‌యం పొందుతోంది. తిరిగి ఇంటికి వెళ్ల‌డానికి అంబులెన్స్ కూడా రాలేద‌ని ఆ కుటుంబం తెలిపింది. త‌మ‌ను ఎలాగైనా స్వ‌గ్రామానికి పంపించాల‌ని కోరుతోంది. (శనివారం తెలంగాణ కేబినెట్‌ సమావేశం)

మరిన్ని వార్తలు