ఎరువుల దుకాణం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం

13 Aug, 2015 19:07 IST|Sakshi

చిట్యాల (నల్లగొండ) : తనకు అవసరమైన యూరియా స్టాక్ లేదని చెప్పినందుకు ఆగ్రహించిన ఓ రైతు ఫెర్టిలైజర్ దుకాణం ఎదుట ఆత్మహత్యకు యత్నించాడు. నల్లగొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన జడల మల్లేశం స్థానిక రఘురామా ఫెర్టిలైజర్స్ వద్దకు వెళ్లాడు. ఒక బస్తా యూరియా కావాలని దుకాణం యజమానిని అడగగా అతడు స్టాక్ లేదని బదులిచ్చాడు.

కాగా స్టాకున్నా లేదని చెబుతున్నాడంటూ తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగబోయాడు. అక్కడే ఉన్న రైతులు అతనిని వారించి, అక్కడి నుంచి పంపేశారు. ఈ విషయమై దుకాణ యజమాని మాట్లాడుతూ...తనను యూరియా బస్తా అప్పుగా ఇవ్వాలని అడగ్గా, తాను నిరాకరించటంతో పురుగుల మందు తాగేస్తానని బెదిరించాడని చెప్పాడు.

మరిన్ని వార్తలు