రైతు బలవన్మరణం

4 Sep, 2015 15:12 IST|Sakshi

బషీరాబాద్ (రంగారెడ్డి) : సాగులో నష్టాలు రావడంతో మనస్తాపం చెందిన ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా బషీరాబాద్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. జిల్లాలోని యాలాల మండలం ఇంకెపల్లి గ్రామానికి చెందిన కాశప్ప(40) అనే రైతు  బషీరాబాద్ మండలంలో 5 ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. అయితే పంట దిగుబడి సరిగా లేకపోవడం, చేసిన  అప్పులు తీరే మార్గం లేకపోవడంతో కాశప్ప.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

మరిన్ని వార్తలు