పత్తి రైతు ఆత్మహత్య

27 Sep, 2015 08:27 IST|Sakshi

పాల్వంచ రూరల్ (ఖమ్మం) : ఇటీవల కురిసిన వర్షాలు ఓ అన్నదాత ఇంట విషాదాన్ని నింపాయి. ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం పులుకుల గ్రామంలో రైతు నీరుడు మాధవరావు (43)కు ఆరెకాల పొలం ఉంది. నాలుగు ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. వర్షాలకు అది దెబ్బతినడంతో మనస్తాపం చెంది శనివారం అర్ధరాత్రి పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతడికి భార్య లక్ష్మి, కుమార్తె, కుమారుడు ఉన్నారు.

మరిన్ని వార్తలు