అన్నదాత ఆత్మహత్య

16 Oct, 2015 15:04 IST|Sakshi

జోగిపేట (మెదక్) : మెదక్ జిల్లా ఆందోల్ మండలం చింతకుంట గ్రామంలో ఓ రైతు శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన లింగయ్య (36) రెండెకరాల్లో వరి పంట సాగు చేశాడు. అది కాస్తా ఎండిపోవడంతో మనస్తాపం చెంది శుక్రవారం మధ్యాహ్నం ఇంటికి సమీపంలో ఉన్న ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. లింగయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

>
మరిన్ని వార్తలు