రైతు ఆత్మహత్య

5 Dec, 2015 17:37 IST|Sakshi

మఠంపల్లి (నల్గొండ జిల్లా) : నల్గొండ జిల్లా మఠంపల్లి మండలం చెన్నాయపాళెం గ్రామంలో శనివారం సాయంత్రం ఓ  రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుచేసి వేసిన పంట వర్షాభావంతో కళ్లముందే ఎండిపోవడంతో ఆవేదన చెందిన నాగూ నాయక్(35) అనే రైతు తన పొలంలోనే చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి రూ.2.80 లక్షల అప్పు ఉంది. అది తీర్చే దారేదని ఆవేదన చెందేవాడని ఇరుగుపొరుగువారు చెప్పారు. మృతుని భార్య ఆరు నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది.

మరిన్ని వార్తలు