అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

21 Jan, 2016 13:04 IST|Sakshi
భిమిని: అప్పుల బాధ భరించలేక రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన అదిలాబాద్ జిల్లా భిమిని మండలం తాళ్లరెడ్డెన గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన దుర్గం రాజయ్య(36)కు వ్యవసాయంలో దిగుబడి సరిగాలేదు. ఈ నేపధ్యంలో గత రెండేళ్లుగా పంటలు సరిగ్గా పండక పోవడంతో.. అప్పులు పెరిగిపోయాయి. దీంతో వాటిని తీర్చే దారికానరాక మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 
మరిన్ని వార్తలు