అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య

12 Mar, 2016 12:11 IST|Sakshi
ధరూరు: రంగారెడ్డి జిల్లా ధరూరు మండలం కారెల్లి గ్రామంలో అప్పుల బాధకు తాళలేక యాదయ్య(28) అనే రైతు శనివారం వేకువజామున పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న రెండెకరాల పొలంలో రూ. 2 లక్షలు అప్పుచేసి పంట పెట్టగా వర్షాభావంతో పంటలు ఎండిపోవడంతో అప్పు తీర్చే మార్గంలేక కలత చెంది పురుగుల మందు తాగాడని కుటుంబసభ్యులు తెలిపారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.
 
మరిన్ని వార్తలు