విద్యుదాఘాతానికి రైతు బలి

13 Jan, 2016 20:14 IST|Sakshi

ఆదిలాబాద్: పంటను రక్షించుకోవడం కోసం పొలంలో ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు ఓ రైతు ప్రాణాన్ని బలిగొన్నాయి. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా దండెపల్లి మండలం చింతపల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది.


గ్రామానికి చెందిన కొక్కెర తిరుపతి(38) అనే రైతు అడవి పందుల నుంచి పంటను కాపాడుకునేందుకు విద్యుత్ తీగలు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం బావి వద్ద  పని చేస్తుండగా.. ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో తిరుపతి అక్కడిక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రైతు మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.

మరిన్ని వార్తలు