కందుకూరు: కందుకూరు మండలం దెబ్బలగూడలో ప్రమాదవశాత్తూ కరెంటు షాక్ తగిలి ఓ వ్యక్తి మృతిచెందాడు. దెబ్బలగూడ సమీపంలోని తండాలో పైపులైను పనుల నిమిత్తం గుంత తవ్వుతుండగా గడ్డపార సర్వీసు వైరుపై పడటంతో కరెంటు షాక్ కొట్టింది. ఆదివారం జరిగిన ఈ ఘటనలో వరికుప్పల నరసింహా(50) అనే వ్యక్తి మృతి అక్కడిక్కడే మృతిచెందాడు.