14 నుంచే ‘రైతుబీమా’ అమలు

5 Aug, 2018 01:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 14 నాటికే రైతుబీమా పూర్తిస్థాయిలో అమల్లోకి రానుందని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి తెలిపారు. ఈ మేరకు ఆయన జిల్లా కలెక్టర్లకు లేఖ రాశారు. ఈ నెల 6 నుంచి 14నాటి కి రైతులకు బీమాపత్రాలు ఇస్తామన్నారు. 14 నుంచి సంబంధిత రైతు కుటుంబ సభ్యుల్లో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి 10 రోజుల్లో రూ.5 లక్షలు క్లెయిమ్‌ అందుతుందన్నారు. దీన్ని ఎల్‌ఐసీకి  తెలియజేశామని పేర్కొన్నారు.

రైతుబీమా పత్రాల పంపిణీ కార్యక్రమా న్ని గ్రామసభల్లో అందజేయాలని నిర్ణయించామని, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొనాల ని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. 6న ఈ కార్యక్రమాన్ని మొదలుపెడుతున్నా ప్రత్యేకంగా ప్రారంభం అంటూ హడావుడి చేయకూడదని నిర్ణయించినట్లు తెలిసింది. బీమా పాలసీకి ప్రారంభ ఉత్సవం చేయడమంటే సెంటిమెంట్‌గా మంచిది కాదని సర్కారు భావించినట్లు సమాచారం.  

మరిన్ని వార్తలు