మార్కెట్‌యార్డులో యువరైతు ఆత్మహత్యాయత్నం

16 May, 2019 20:30 IST|Sakshi

సాక్షి, నల్గొండ : అధికారుల నిర్లక్ష్య వైఖరికి మనస్తాపం చెందిన ఓ యువరైతు పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన కొండమల్లేపల్లి మార్కెట్‌ యార్డులో గురువారం జరిగింది. హకుల్‌ అనే రైతు పదిహేను రోజుల క్రితం వరిధాన్యాన్ని మార్కెట్‌కు తీసుకొచ్చాడు. కానీ, తేమ ఉందని చెప్పిన అధికారులు అతని ధాన్యాన్ని కొనుగోలు చేయలేదు. దళారీలు తెచ్చిన ధాన్యాన్ని మాత్రం ఏ అభ్యంతరం లేకుండా కొనుగోలు చేయడం గమనించిన హకుల్‌ వారితో గొడవకు దిగాడు. నీ దిక్కున్న చోట చెప్పుకో అని అధికారులు సమాధానమివ్వడంతో మనస్తాపం చెందిన ఆ రైతన్న మార్కెట్‌లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అక్కడున్న వారు స్పందించి అతన్ని ఆస్పత్రికి తరలించారు. బాధితుని ఆరోగ్య పరిస్థితి తెలియాల్సి ఉంది.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
నల్గొండలో యువరైతు ఆత్మహత్యాయత్నం

మరిన్ని వార్తలు