కౌలురైతు ఆత్మహత్య

9 Sep, 2015 13:37 IST|Sakshi

నవీపేట: అప్పుల బాధ తట్టుకోలేక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం దండెపల్లిలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన చిన్నగారి నర్సింగరావు 54 గత ఐదేళ్లుగా.. గ్రామంలోని మరో రైతుకు చెందిన నాలుగు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. సకాలంలో వర్షాలు పడకపోవడంతో.. పెట్టిన పెట్టుబడి తిరిగి రాదనే బాధతో ఇంటి సమీపంలోని చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు